Homeఎంటర్టైన్మెంట్ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

Sonu Sood
ఢిల్లీ వేదికగా రైతుల ఉద్యమం నడుస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు అనేక రోజులుగా కేంద్రంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో కేంద్రం చర్చలు జరిపినా పరిష్కారం లభించలేదు. రోడ్ల పక్కనే వంటా వార్పు చేసుకుంటూ… అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికే 20మంది రైతులు ఈ ఉద్యమంలో మరణించినట్లు తెలుస్తుంది.

Also Read: మెగా ఫ్యామిలీ నుండి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’

కాగా ఈ రైతు ఉద్యమంపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు. రైతుల దుస్థితికి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ డైలీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సోనూ సూద్… అన్నదాతల దుస్థితి చూసి వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి ఎవరు కారణం అని నేను అడగడం లేదు. రైతుల సమస్యలను పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నాను అన్నారు. నేను కూడా పంజాబ్‌లో పుట్టాను, రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రేమతో చెబితే వారు వింటారని సోనూ సూద్ తెలిపారు. ఈ ఉద్యమంలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. పంటపొలాల్లో విత్తనాలు నాటుతూ ఉండాల్సిన సమయంలో.. అన్నదాతలు తమ పిల్లలతో రోడ్లపై చలితో వణుకుతూ గడపుతున్నారు. ఇంకా ఎంత కాలం వాళ్లు ఈ దుస్థితి ఎదుర్కోవాలి … అని ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read: మహేష్ గురించి ఆసక్తికర విషయాలని బయటపెట్టిన అడివిశేష్

ఇక కరోనా సమయంలో వందల మంది కార్మికులను తమ స్వగ్రామాలకు వాహనాలు సమకూర్చి పంపారు సోనూ సూద్. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎవరు తమ సమస్యను విన్నవించుకున్నా, అడిగిందే తడవుగా సాయం చేస్తున్నారు. కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ సాయం చేయడం కోసం తన ఆస్తులు పది కోట్లకు తాకట్టు పెట్టారని సమాచారం. సోనూ సూద్ కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగులో ఆచార్య చిత్రంతో పాటు, అల్లుడు అదుర్స్ చిత్రాలలో సోనూ సూద్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular