దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 67,708 కరోనా పాజిటివ్ కేసులునమోధైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,07,098 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 680 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,11,266కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,12,390 యాక్టివ్ కేసులు ఉండగా.. 63,83,442 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గినట్లే కనిపించినా రెండు రోజుల్లో మరోసారి భారీ పెరిగాయి. వాతావరణ మార్పులతో పాటు సెకండ్ వేవ్ కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.