Homeఆంధ్రప్రదేశ్‌జగన్ లేఖపై ఎవరూ మాట్లాడొద్దు.. వైసీపీ కఠిన ఆదేశం?

జగన్ లేఖపై ఎవరూ మాట్లాడొద్దు.. వైసీపీ కఠిన ఆదేశం?

కాగల కార్యం గంధర్వుడే  తీర్చాడు.. ఎక్కడ ఎవరికి తాకాలో వారికే తాకింది. దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక చిన్న నాయకులతో ఏం పని. అందుకే అందరూ మౌనం దాల్చాలని..ఎవరూ ఈ వివాదాస్పద అంశంపై నోరు తెరవద్దని వైసీపీ అధిష్టానం వైసీపీ నేతలందరికీ స్టిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టు సమాచారం.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

Also Read: జగన్‌ దర్శనం కోసం ఆ ‘పూజారి’ ఆశీర్వాదం తప్పనిసరి..!

సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ప్రకంపనలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ సుప్రీం కోర్టు జడ్జి మీద.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మేనేజ్ మెంట్ మీద జగన్ రాసిన లేఖ ఇప్పటికీ చర్చనీయాంశమైంది. దీనిపై సెగలు, పొగలు రగులుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే వైసీపీ నేతలు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం తప్పితే సీఎం జగన్ నుంచి ఏ వైసీపీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కూడా స్వయంగా మీడియాతో స్పందించడం లేదు. ఎందుకు? అంటే ఆల్ రెడీ వారికి ఆదేశాలు అందాయని ప్రచారం సాగుతోంది.

తాజాగా వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏ వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది. వారి వాట్సాప్ గ్రూపులో ఈ మేరకు వైసీపీ నేతలకు ఈ సందేశాన్ని పంపినట్టు సమాచారం.

Also Read: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

సీఎం జగన్ ఇప్పటికే లేఖ రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారని.. దయచేసి నేతలు ఎవరూ ఈ అంశంపైన మీడియాతో మాట్లాడవద్దని.. స్పందించవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular