
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 650 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,17,956 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,80,680 యాక్టివ్ కేసులు ఉండగా.. 70,16,046 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 8.71గా ఉంది.