
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 470 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,22,111కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,70,458 యాక్టివ్ కేసులు ఉండగా.. 74,91,513మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 56,684 మంది డిశ్చార్జ్ అయ్యారు.