
దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 490 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,26,611కి చేరింది. ప్రస్తతం దేశంలో 5,09,673యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 79,17,373 గా ఉంది. గత పది రోజులగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి కంటే 0.5 శాతం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యయి.