
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 36,652 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 512 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,08,211గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,39,700కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,09,689 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 90,58,822గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 96 లక్షల కేసులు దాటాయి. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి.