
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 31,118 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 482 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,62,810గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,37,6219కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,35,603 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 88,89,585 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 94 లక్షల కేసులు దాటాయి. కరోనా పాజిటివ్ రేటు 4.60 శాతం ఉండగా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.