
భారత్ లో కరోనా కేసులు కోటి రిమార్కకు దగ్గరగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కోటి కరోనా కేసులకు దగ్గరగా వెళుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 22,382 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 387 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,32,548గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,44,096కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,32,002 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 94,56,449గా ఉంది.