
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా సుమారు 5వేల కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్ లో తెలిపింది. గత 24 గంటల్లో 64,800 శాంపిల్స్ పరీక్షించగా, 4,872 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1.98 కోట్ల శాంపిల్స్ ను పరీక్షించారు. తాజాగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 86 మంది మరణించారు.