టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం తెలిపింది. శనివారం పలు కార్పొరేషన్లుకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్లు పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు.