
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసిది. కొవిడ్ కారణంగా మరణించిన ప్రతి ఒక్కరికి రూ. 4 లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని తెలిపింది.