కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యలు అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్ దే్ ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. రామ్ దేవ్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఒరిజినల్ వీడియోను, దానిలోని మాటలను రాసిన పత్రాలను సమర్పిస్తానిని తెలపారు. దీంతో తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు.