
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. మరోవైపు 2,003 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి.