Homeఎంటర్టైన్మెంట్Tollywood exhibitors controversy : పెద్ది' విడుదల పై వీడని టెన్షన్.. రంగంలోకి దిగిన మెగాస్టార్...

Tollywood exhibitors controversy : పెద్ది’ విడుదల పై వీడని టెన్షన్.. రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. అసలు ఏమి జరుగుతోంది?

Tollywood exhibitors controversy : మరో 9 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ది మేనియా నే కనిపిస్తోంది. ఆ స్థాయిలో మేకర్స్ ప్రొమోషన్స్ చేస్తున్నారు. అయితే ‘పెద్ది’ చిత్రానికి సమస్యలు ఇంకా పూర్తిగా వీడిపోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఎక్సిభిటర్స్ గిల్డ్ మరియు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య జరిగిన గొడవలు మనమంతా చూశాము. మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి, లేదంటే థియేటర్స్ ని మూసేస్తామని ఎక్సిభిటర్స్ గిల్డ్ సభ్యులు, అదే విధంగా మేము నిర్దిష్టమైన ప్రణాళికలు, షరతులు లేకుండా, కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేయడానికి ఒప్పుకోము అంటూ నిర్మాతలు మీడియా ముందుకొచ్చి కొట్లాడుకున్నారు.

ఆ తర్వాత రెండు రోజులకు ఈ రెండు గిల్డ్స్ మధ్య చర్చలు జరగడం, ఈ చర్చలు వాడావేడి వాతావరణం లో మొదలైనప్పటికీ , చివరికి సామరస్యంగానే చర్చలు ముగించడం, ఆ తర్వాత స్వయంగా దిల్ రాజు నే ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని , స్మూత్ గానే విడుదల అయ్యేలా చేస్తామని మాట ఇవ్వడం తో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు ఎక్సిభిటర్స్ మరోసారి స్వరం మార్చారు. మాకు ఎట్టి పరిస్థితిలోనూ ‘పెద్ది’ చిత్రం నుండే కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని నడిపే విధానం కావాలి అంటూ మీడియా ముందుకొచ్చారు. నేడు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తో కూడా భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్ , ఏషియన్ సునీల్, సురేష్ బాబు లతో పాటు , పలువురు కీలక నిర్మాతలు కమ్ ఎక్సిభిటర్స్ ఈ భేటీ లో పాల్గొన్నారు.

చిరంజీవి కి ప్రస్తుతం థియేటర్స్ ఎదురుకుంటున్న సమస్యలను వివరించి, కమీషన్ బేసిస్ మీద నడుపుకునేలా అడుగులు ముందుకు వేసేందుకు సహకరించమని కోరడం , అందుకు చిరంజీవి కూడా సానుకూలంగానే రెస్పాన్స్ ఇచ్చాడని దిల్ రాజు చెప్పడం వంటివి కాసేపటి క్రితమే జరిగాయి. మరో రెండు రోజుల్లో కీలక సమావేశం ఉందట , అదే విధంగా రాజమండ్రి పర్యటన లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా వీళ్లంతా రేపు భేటీ అవ్వబోతున్నారట. త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం జరగనుంది. అయితే ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే, తెలంగాణ ప్రాంతం లో పెద్ది చిత్రాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రణాళికలు దిల్ రాజు గ్యాంగ్ సిద్ధం చేస్తుందని , టికెట్ హైక్స్ రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular