జీజీహెచ్ లో విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రమ్య హత్య ఘటన చాలా బాధకరమని సుచరిత అన్నారు. ఇప్పటిే కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారని తెలిపారు. విచారణ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సుచరిత భరోసా ఇచ్చారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.