
నెల్లూరు రూరల్ మండలం గోల్లకందుకురు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు (43) లాలి లక్షీకాంతమ్మ (45) అబ్బుకోటి పెంచాలయ్య (60) తాంధ్రా వెంకతరమనమ్మ (19)గా గుర్తించారు. వీరు పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.