ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అఖిలేస్ యాదవ్ సారథ్యంలో సమాజ్ వాది పార్టీ సత్తా చాటుకుంది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లలో 15 సీట్లలో ఎస్ పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తుంటారు. రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి పరగంగా, రెలిజియస్ టూరిజం పరంగా యోగి కీలకంగా తీసుకున్నవి కావడం విశేషం. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్ వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది.