
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 90,532 మంది నమూనాలు పరీక్షించగా 2,930 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 4,346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,871 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు, తూర్పు గోదావరిలో ఐదుగురు మరణించారు.