రైతు, రైతుబిడ్డ అయిన కెసీఆర్ ముఖ్యమంత్రి అవడం మన అదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు అనేది దేశంలో ఎవరికి రాని ఆలోచన, ప్రధాన మంత్రి కూడా ఈ పథకం స్పూర్తితో పిఎం కిసాన్ ను ప్రారంభించారన్నారు. రైతు భీమా పథకం ను మొట్టమొదటి గా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ, ఎవరికి ఒక పైసా లంచం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రోజు రిజిస్ట్రేషన్, ముటేషన్ ధరణి ద్వారా చేస్తున్న ప్రభుత్వం మనదే అని తెలిపారు.
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ లో లాగా పూర్తి ధాన్యం ను కొనడంలేదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఒకప్పుడు నీటికి కటకటలాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు నిండు కుండలా మారింది. భారత దేశంలోనే గొర్రెల సంఖ్య రెట్టింపు ఐన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు కళ్ళముందు ఆవిష్కరించ బడినాయి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం గా మారింది. తెలంగాణ ఉద్యమంలో మీకు పంటలు పండించవచ్చా అని అడిగిన సందర్బం నుండి దేశానికే తెలంగాణ ధాన్యాగారం గా మారింది. కేవలం సిరిసిల్ల జిల్లా లోనే ఒక లక్ష టన్నుల ధాన్యం అదనంగా పండిందని తెలిపారు.
ఎఫ్.సి.ఐ దొడ్డు వడ్లు కొనమంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రితో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరం కొనడానికి ఒప్పించారు. ఈ పంటలు పండించడం, ప్రత్యామ్నాయం వైపు చూడకపోతే తీవ్రంగా ఇరుక్కుపోతాం. నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, శనగలు లాంటి పంటలు పండించాలి. ఆయిల్ ఫాం పంటకు జిల్లాలో మంచి అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో వంద ఎకరాల్లో ఆయిల్ ఫాం పంట పండించేలా చూడాలి. నేను మోహినికుంటలో పది, పదిహేను ఎకరాలు కొనుక్కుని ఆయిల్ ఫాం పంటను పండిస్తానని తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Cm kcr is working for the welfare of the farmer ktr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com