
బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా ఈరోజు విశాఖ పట్టణం సమావేశంలో భాగంగా ఈ రోజు విశాఖ పట్టణంలో పార్లమెంట్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు.