
బుర్రవున్న వారెవరైనా ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తారా? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు కోరుతూ పాల్ చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మతిలేదా ? అని ప్రశ్నించారు. మీ పనికి మాలిన విద్యాశాక మంత్రి మాటను..జగన వినవద్దు.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. తన సొంత కూతుర్లును పరీక్షలు రాయడానికి కోవిడ్ హాల్లోకి పంపిస్తారా? అని నిలదీశారు.