
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ చికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా చికిత్సలపై హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసీయేషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తెరిచారా అని అడిగింది. కొవిడ్ పరీక్షలు ఎంతమేర పెంచారు. నిర్ధారణ పరీక్షలు ఆలస్యమైతే బాధితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది.