
టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ మిక్స్ డ్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది. మరోవైపు 10మీ. ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. భారత మహిళా షూటర్లు ఫైనల్ కు చేరలేకపోయారు. 626.5 పాయింట్లతో ఎలవెనిల్ వలేరియన్ 16,621.9 పాయింట్లతో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలిచారు.