
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ను కొట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్ ను రఘురాము తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీం కోర్టు నిర్ణయం పై న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది.