Amaravati : ఆంధ్రుల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతోంది. ఆంధ్రుల రాజధాని కల ఇన్నాళ్లకు సాకారం కాబోతోంది. మద్రాస్ ప్రావీన్స్ లోనే ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాస్ ను రాజధానిగా ఇవ్వాలని కోరినా ఫలించలేదు. ఆంద్ర నాడు రాజధాని లేకుండా ఏర్పడింది. కర్నూలులో గుడారాల్లో ఆంధ్రా రాజధానిని నిర్వహించారు. విశాలాంధ్ర భావన రావడంతో తెలంగాణ, ఆంద్రా కలిసి హైదరాబాద్ ను రాజధానిగా చేసుకున్నారు. 2014లో ఆంధ్రా విడిపోయాయి. మళ్లీ రాజధాని లేని ఆంధ్ర ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాదు, కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, రాష్ట్ర విభజన తర్వాత వరకు ఆంధ్ర ప్రజలు రాజధాని కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తోంది.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని అంశంలో ఆయన వైఖరి ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిందని, ప్రజల ఆవేదనను అర్థం చేసుకోకుండా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. మరోవైపు, జగన్ పార్టీ మాత్రం రాజధాని వికేంద్రీకరణ లక్ష్యంతోనే తమ నిర్ణయాలు తీసుకున్నామని గతంలో స్పష్టం చేసింది.
రాజధాని అంశంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలపై విశ్లేషకులు ‘రామ్’ గారు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ విశ్లేషణను కింది వీడియోలో వీక్షించవచ్చు.
