Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఆ 82 స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులు.. జాబితా వైరల్

YCP: ఆ 82 స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులు.. జాబితా వైరల్

YCP: ఏపీ సీఎం జగన్ వైసీపీలో భారీ ప్రక్షాళనకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11మంది అసెంబ్లీ అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించారు. ఒక్క ప్రజా వ్యతిరేకతే కాదు…చాలా రకాలుగా ఆలోచనలు చేసి సంచలన మార్పులకు తెర తీయనున్నారని ప్రచారం జరుగుతోంది.మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఇష్టుడైన నాయకుడిని వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే.. జగన్ ఎటువంటి సంచలన నిర్ణయాలకు వెల్లడించే అవకాశం ఉందో తెలుస్తోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది.ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 82 సీట్లలో సిట్టింగులను మార్చనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది జాబితా అంటూ ట్రోల్ అవుతోంది.

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం,ఎచ్చెర్ల లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరానికి సంబంధించి రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక ,విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి.. అరకు జిల్లాకు సంబంధించి అరకు, పాడేరులో అభ్యర్థులను మార్చుతారని తెలుస్తోంది.
* కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం… అమలాపురం జిల్లాకు సంబంధించి అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి. గన్నవరం నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి సిటీలో అభ్యర్థి మార్పు తధ్యమని తేలుతోంది.
* నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిగూడెం, ఉండి, ఏలూరు జిల్లా పరిధిలో చింతలపూడి, పోలవరం, ఉంగటూరు, మచిలీపట్నం జిల్లా అవనిగడ్డ, పెడన.. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటలో అభ్యర్థుల మార్పు చేస్తారని తెలుస్తోంది.
* గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్.. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట.. బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు.. ఒంగోలు జిల్లాకు సంబంధించి దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం.. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు ఖాయమని తేలుతోంది.
* తిరుపతి జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు.. రాజంపేట జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట.. వైయస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం.. కర్నూలు జిల్లాలో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ.. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు.. సత్యసాయి జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి.. అనంతపురం జిల్లా సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యంగా వైసిపి హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular