ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోవడం లేదు. వారిని నోరు తెరవనీయడం లేదు. దీంతో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనకు నేరుగా లేఖలు రాస్తున్నారు. వాటిని వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాలు గతంలో కీలకంగా పనిచేసిన రామారావు అనే ఉద్యోగి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
వెంకట్రామిరెడ్డి ఎప్పుడూ ఉద్యోగుల కోసం మాట్లాడిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి మద్దతివ్వడం సామాజిక బాధ్యత అని ఆయన రెచ్చిపోతూ ఉంటారు. సచివాలయంలో ఉద్యోగులు కరోనాతో చనిపోతే వారికి రావాల్సిన బెనిఫిట్స్, కారుణ్య నియామకాల కింద పిల్లలు చాన్స్ ఇప్పించేందుకు వెంకట్రామిరెడ్డి కనీస ప్రయత్నం చేయలేదు. నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల్లో పెడతానన్నప్పుడు ఉద్యోగుల తరఫున తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డి అప్పట్లో అందరికీ వ్యాక్సిన్ వేయించాలని డిమాండ్ చేశారు.
వెంకట్రామిరెడ్డి వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి విబిన్న మార్గాల్లో లబ్ధి పొందుతున్నారు ఆరోపణలు ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది దే సమయంలో ఉద్యోగుల గురించి కాకుండా ఇతర సంఘాలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రభుత్వాధినేతల చేతుల్లో పావులుగా మారింది అంటున్నారు. ఆయనకు ఇప్పటికే మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపణలు చేస్తున్నారు.
ఉద్యోగుల ఆగ్రహం మెల్లగా పైకి వస్తుండడంతో ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ గురించి కరోనా కష్టాల గురించి ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడటం ప్రారంభించారు.సీపీఎస్ రద్దు చేయాలని ప్రకటనలు ఇస్తున్నారు. మరికొన్ని రోజులు పోతే ఉద్యోగుల తిరుగుబాటు తప్పకపోవచ్చు అంచనాతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఎదురుతిరిగే రోజు రావొచ్చని చెబుతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Who care welfare of employees
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com