spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ కుర్చీ సేఫ్..!

జగన్ కుర్చీ సేఫ్..!

CM Jagan
“సుప్రీం కోర్టు లోని ఓ న్యాయమూర్తి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు” అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ఈ ఆరోపణలు చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చర్య న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సవాల్ చేయడమేనని, దీని వల్ల జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేసుకున్నారు. పదవీ గండం తప్పదని విశ్లేషకులు కూడా భావించారు.

Also Read: చంద్రబాబు విశ్వసనీయతను ప్రజలు నమ్మడం మానేశారా?

టీడీపీ నేతల పట్టు..

ఇక, టీడీపీ నేతలైతే.. విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ న్యాయవ్యవస్థను అవమానించారని, ఇలాంటి వ్యక్తిని సీఎం పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి మరీ ఈ కేసును ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను జగన్ నాశనం చేస్తున్నారని, న్యాయవ్యవస్థను కూడా శాసించడానికే ఈ లేఖ రాశారని టీడీపీ పదే పదే ఆరోపించింది. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలయితే వెంటనే జగన్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అంతే కాకుండా.. వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులను సైతం టీడీపీ రంగంలోకి దించింది. తమిళనాడుకు చెందిన మణి, మరో న్యాయవాది సునీల్ సింగ్ లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. లేఖను బహిర్గతం చేసినందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా పిటీషన్ లలో కోరారు.

ఆశలు అడియాసలు…

నిజానికి ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ.. సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటీషన్లను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ను పదవి నుంచి తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. దీంతో తెలుగు దేశం పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి.

Also Read: హైకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. ‘పంచాయతీ’కి లైన్ క్లియర్..!

చీఫ్ జస్టీస్ స్పందన ఎలా ఉంటుందో..?

జగన్ ను పదవీచ్యుతున్ని చేయాలన్న పిటీషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరి, రాష్ట్ర హై కోర్టును సుప్రీం న్యాయమూర్తి ప్రభావితం చేస్తున్నారంటూ జగన్ రాసిన లేఖ పై ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి, ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper