Homeఆంధ్రప్రదేశ్‌మోదీ సర్కారు మరో ‘నగదు బదిలీ’ వ్యూహం

మోదీ సర్కారు మరో ‘నగదు బదిలీ’ వ్యూహం

Modi Sarkar
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2013లో గ్యాస్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని బీజేపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ప్రజల్ని దోచుకుంటున్నారని.. క్రమంగా సబ్సిడీ ఎత్తివేయాలని ఈ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. ప్రజలు కూడా వారి మాటలు నమ్మి ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఆ నగదు బదిలీని ప్రారంభించారు. వ్యతిరేకించి వారందరూ దేశభక్తలు కాదంటూ.. ఎమోషనల్ బ్లాక్ మేయిల్ చేయడంతో ఎవరూ నోరు మెదపలేదు. అప్పట్లో రూ.800 ఉండే సిలిండరు ధరకు రూ.300 వరకు సబ్సిడీ వచ్చేది. ఎంతో కొంత ఇస్తున్నారని ప్రజలు కూడా సర్దుబాటు చేసుకున్నారు.

Also Read: సమయం లేదు.. ఇక తాడో పేడో.. అమిత్ షాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

ఇప్పుడా సబ్సిడీ రూ.400 నుంచి రూ.16కు పడిపోయింది. దీంతో ప్రజలు అవాక్కవ్వాల్సి వస్తోంది. అలాగని గ్యాస్ సిలిండరు ధర కూడా ఏమాత్రం తగ్గలేదు. సబ్సిడీని వదలుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రచారం సైతం చేసింది. స్టార్లతో ప్రకటనలు ఇప్పిచింది. కానీ ఎక్కువమంది వదులుకోలేదు. ఇప్పుడు సబ్సిడీని కేంద్రమే ఎత్తివేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును చూసిన జనం నగదు బదిలీలో ఇంత మోసమా అని నోళ్లు నొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకముందు నగదు బదిలీ చేస్తే.. ఇలాగే ఉంటుందా అన్న చర్చకూడా ప్రారంభం అయ్యింది.

ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఉచిత విద్యుత్ వద్దు.. మీటర్లు పెట్టి.. ఎంత వాడుకుంటే అంత నగదు బదిలీ చేయమని చెప్పింది. అలా జరిగితే.. నాలుగువేల కోట్ల రూపాయల రుణం ఇస్తామని చెప్పింది.దానికి ఏపీ సర్కారు అంగీకరించి.. మీటర్లు పెడుతోంది. నగదు బదిలీ చేస్తానమి రైతులు కంగారు పడవద్దని చెబుతోంది. కానీ గ్యాస్ కు నగదు బదిలీలలో ప్రభుత్వం చేసిన మాయాజాలం చూసిన చాలా మంది రైతులు కంగారు పడిపోతున్నారు.

Also Read: తెలంగాణలోని ఆ జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం.. అన్నం పూర్తిగా మాడిపోవడంతో..?

తమకూ ఇదే పరిస్థితి తీసుకువస్తే.. ఏం చేయాలా అని మథన పడుతున్నారు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి అంగీకరించింది. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టను ప్రారంభించింది. ఇప్పుడు రైతులు తప్పించుకోలేదని పరిస్థితిలో ఉన్నారు. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే నగదు బదిలీ ఉంటుందని .. తరువాత ఉచిత విద్యుత్ ఎరిగిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular