spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ వ్యూహంలో దిగ్గజాలకు చోటు లేదా?

జగన్ వ్యూహంలో దిగ్గజాలకు చోటు లేదా?

Jagan
ఒకప్పటి జగన్‌ వేరు.. ఇప్పటి జగన్‌ వేరు. ఎన్నికలకు ముందు జగన్‌కు తెలిసింది వేరు.. ఇప్పుడు ఆయనకు నేర్చుకుంది వేరు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి రాజకీయ పరిపక్వత సాధించినట్లుగా చెప్పాలి. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కూడా. సాధారణంగా ప్రాంతీయ పార్టీ అంటే ఆ పార్టీ అధినేతదే ఫైనల్‌ నిర్ణయం. దీనిని ఎవరూ కాదనేది లేదు కూడా. అలా అనీ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే కూడా క్యాడర్‌‌ దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అధినేత నిర్ణయాలపైనే ఒకవిధంగా పార్టీ మనుగడ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే.. పార్టీ అన్నప్పుడు ఆ పార్టీలోని సీనియర్లు తమ అనుభవాలతో కొన్ని సలహాలు, సూచనలు అధినేతకు చెబుతుంటారు. ఏపీలో వైసీపీలో చాలామంది సీనియర్ నేతలే ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేసిన వారూ అందులో ఉన్నారు. వయసు రీత్యా కూడా వారు జగన్ కంటే పెద్దవారు. రాజకీయంగా అనుభవంలోనూ సీనియర్లు. సహజంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వీరిపైనే ఎక్కువ ఆధారపడతారని అందరూ భావించారు. సీనియర్ నేతలు సైతం తాము చక్రం తిప్పొచ్చని కలలు కన్నారు. కానీ.. వారి అంచనాలన్నీ జగన్ తలకిందులు చేస్తున్నారు.

ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమని అంటున్నారు నిపుణులు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జగన్ అందరి నేతలకు అప్పగించారు. కొన్ని జిల్లాలను సీనియర్ నేతలకు, మంత్రులకు అప్పగించారు. సహజంగా ఇన్‌చార్జి మంత్రులు, సీనియర్ల వద్దకు నేతలు క్యూ కడతారు. తమకు పదవులపై హామీ ఇవ్వాలని పట్టుబడతారు. ఏ పార్టీలోనైనా సహజంగా జరిగేది ఇదే. వైసీపీలో కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీనియర్ నేతలు, మంత్రులు అనేక మందికి హామీలు ఇచ్చారు. మేయర్లు, చైర్మన్లు చేస్తామని చెప్పారు. అయితే.. వారు తమ వర్గాన్ని కాపాడుకునేందుకే ఇలాంటి హామీలు ఇచ్చి ఉండొచ్చు.

కానీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం జగన్ సీనియర్ నేతలను, మంత్రులను దూరం పెట్టారు. వారు చేసిన సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. జగన్ సామాజికవర్గాల ఆధారంగానే కొత్త వారికి అవకాశమివ్వడంతో సీనియర్ నేతలు సైతం అవాక్కయ్యారు. దీంతో మంత్రులకు సైతం కొన్ని చోట్ల భంగపాటు తప్పలేదు. తాము మాటిచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలకు కూడా జగన్ షాకిచ్చారు. వారి నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా మేయర్, చైర్మన్లను స్వతహాగా తానే ఎంపికచేశారు. దీంతో సీనియర్ నేతలు, మంత్రులు ఇంకా జగన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper