Homeఆంధ్రప్రదేశ్‌పవన్ రాకుంటే తిరుపతిలో బీజేపీకి కష్టమేనా..?

పవన్ రాకుంటే తిరుపతిలో బీజేపీకి కష్టమేనా..?

Pawan Kalyan
తిరుపతి ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను బీజేపీతో ఇతర పార్టీలు సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుకోసం పోరాడాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఉంటే తప్పా తిరుపతిలో గౌరవ ప్రదమైన ఓట్లను తాము దక్కించుకోలేమని బీజేపీ నేతలందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. దీంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రావాలంటూ పవన్ కల్యాణ్ ను బీజేపీ నేతలు కోరుతున్నారు.

Also Read: సాగర్ లో బీజేపీ సస్పెన్స్ రాజకీయం..

తాను ప్రచారానికి రావాలంటే.. బీజేపీ ఏం చేయాలన్నది కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. అయతే ఆ షరతులు బీజేపీ ప్రయోజనాలకోసమే అన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. పవన్ కల్యాన్ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడా..? లేదా మరేమైన అంశాలు ఉన్నాయా అన్న కోణంలో బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, స్మృతి ఇరానీ, నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు తిరుపతికి వస్తే.. తాను కూడా ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ షరతులు పెట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకే బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడు తిరుపతికి మత్రం ఎందుకు రారని, బీజేపీ గెలుపు కోసం రావాలని పవన్ అంటున్నారు. నిజంగా తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంటే.. అగ్రనేతలందరినీ తప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నారు.

Also Read: జగన్ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్…

బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడే తాను వచ్చి ప్రచారం చేస్తానని.. వారే రానప్పుడు తాను వచ్చి ప్రచారం ఎలా చేస్తానని పవన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తమవైపు తిప్పుకోవడం అంత సులువు కాదన్నది బీజేపీ నేతల అభిప్రాయం. ఎందుకంటే తమ నాయకుడు పవన్ కల్యాణ్ మద్దతు తెలుపుతుంటే.. ప్రచారానికి కూడా రావాలని కోరుకుంటున్నారు. జనసేన ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోకుంటే టీడీపీ ప్రయోజనం చెందుతుందని బీజేపీ నేతలు ఆందోనళ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి పవన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular