ముడి చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలపై భారత్ ఆగ్రహంతో ఉంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు కోత పెట్టడం ద్వారా ‘చమురు’నే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌదీ నుంచి వార్షిక కాంట్రాక్టుల ప్రాతిపదికన చమురు దిగుమతులకు కోత పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. ఉత్పత్తి కోతలపై సౌదీ అరేబియా వంటి ఒపెక్ దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై భారత్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. ఉత్పత్తి కోతలతో చమురు ధర పెరిగి మా ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయని ఎంత మొరపెట్టుకున్నా ఈ దేశాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇక మన చమురు కొనుగోలు శక్తినే ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించింది.
సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించడం ఇందుకు నేపథ్యం. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధిస్తున్నందున, మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందన్న అంచనాలున్నాయి.
ఐఓసీతోపాటు ఇతర రిఫైనరీలు సౌదీ నుంచి నెలవారీగా చేసుకునే చమురు దిగుమతుల్లో సగటున 65 శాతం మాత్రమే మే నెలకు ఆర్డరు ఇవ్వనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న ముగ్గురు సమాచారం అందించారు. ముడిచమురు ఉత్పత్తి పెంచి, ధరలు తగ్గేలా చూడమని భారత్ కోరినా, సౌదీ అరేబియా పెడచెవిన పెట్టడమూ ప్రస్తుత పరిణామాలకు కారణం. ఉత్పత్తి కోతలపై ఆంక్షలు ఎత్తివేయడంపై సౌదీ అరేబియా నిర్లక్ష్యం వహిస్తుండడంతో, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గత నెలలో ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచించిన విషయం విదితమే.
సౌదీ అరేబియా ఇతర ఓపెక్ దేశాలతో టర్మ్ లేదా స్థిర పరిమాణ కాంట్రాక్టులు కుదుర్చుకోడానికి బదులు స్పాట్ లేదా కరెంట్ మార్కెట్ నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయాలని ఐఓసీ, ఇతర కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. స్పాట్ మార్కెట్లో ధరలు పతనమైతే ఆ ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది. దశాబ్దం కిందటితో పోలిస్తే మన చమురు సంస్థలు తమ స్పాట్ కొనుగోళ్లను 20 శాతం నుంచి 30–-35 శాతం వరకు పెంచుకున్నాయి. ఇటీవలి వారాల్లో గయనా నుంచి నార్వే వరకు.. కొత్తగా కొనుగోళ్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, కెనడా, పశ్చిమాఫ్రికా నుంచీ కొనుగోళ్లు పెంచారు. ఏప్రిల్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు ఒపెక్ నుంచి భారత్లోకి దిగుమతులు 74.4 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి 79.6 శాతంగా ఉన్నాయి.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: India to buy 36 less oil from saudi arabia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com