ఒక రోజు ముందు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్ అంటూ జాతీయస్థాయిలో ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల జాబితాను ప్రతియేటా లాగే జాతీయస్థాయిలో రిలీజ్ చేశారు. ర్యాంకుల పరంగా ఇందులో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు ఎంత సౌకర్యంగా ఉన్నాయి అన్న విషయంపై విశ్లేషించి ఈ ర్యాంకులను నిర్ణయిస్తారు.
ఇకపోతే ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండో యేడాది కూడా అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. 2018 లో నెంబర్ వన్ గా నిలిచిన ఏపీ 2019లో కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే ఇప్పుడు దీని పై సోషల్ మీడియాలో ఒక విశేషమైన చర్చ నడుస్తోంది. క్రెడిట్ కోసం అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం వర్గీయులు కొట్లాడుకుంటున్నారు. 2019 మే నుండి జగన్ పాలన నడుస్తుంది కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఆ ప్రభుత్వానిదే అంటున్నారు.
అయితే తెలుగుదేశం వారు మాత్రం 2018-19 సంవత్సరానికి కేటాయించిన ర్యాంకు ఇది అని…. దాని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం పాలించింది తెలుగుదేశమే కాబట్టి ఆ క్రెడిట్ అంతా మాకే దక్కుతుందని అంటున్నారు. సాంకేతికంగా ఈ ర్యాంకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇచ్చారు అన్న విషయంపై స్పష్టత కొరవడింది.
ఇక దీనిపై పూర్తి వివరాలు మనం ఇప్పుడే చెప్పలేము కానీ వచ్చే ఏడాదికి మాత్రం ఖచ్చితంగా జగన్ సర్కారు పాలన పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి వైసీపీ సమర్థత ఏమిటో అప్పుడు తెలిసిపోతుంది. అప్పటివరకు ఈ కొట్లాట ఇలాగే ఉంటుంది. ఇక ఈ లిస్టులో పొరుగు రాష్ట్రం తెలంగాణ మూడవ స్థానంలో ఉండగా…. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది.