ఆంధ్రప్రదేశ్‌Raghurama Krishnam Raju: రఘురామకు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు, పవన్

Raghurama Krishnam Raju: రఘురామకు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు, పవన్

Raghurama Krishnam Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది సీఎం జగన్ కు తన సత్తా చూపాలని భావించారు. కానీ అది జరిగే పని కాదని తెలుస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడమే అందుకు కారణం.

వాస్తవానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వైసిపి నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే అది నిబంధనల ప్రకారం కుదరలేదు. ఆపై జాతీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఆయన బిజెపిలో చేరతారని సైతం ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ సైతం రఘురామకృష్ణం రాజు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన వైసీపీతో పాటు సొంత నియోజకవర్గానికి సైతం దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టిడిపి, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి తరుపున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. బిజెపి సైతం ఈ కూటమిలో చేరుతుందని.. అప్పుడు పోటీ సునాయాసం అవుతుందని రఘురామకృష్ణంరాజు భావించారు. అయితే ఆయనచే పోటీ చేయిస్తే ప్రతికూలతలు అధికమని సర్వే నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అటు బిజెపి సైతం ఈ కూటమిలోకి వచ్చే ఛాన్స్ లేనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బిజెపి సైతం రఘురామకృష్ణం రాజుకు పెద్దగా విశ్వసించడం లేదని.. ఆయన చంద్రబాబు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారంటూ బిజెపి అగ్ర నాయకత్వం అనుమానంతో ఉంది. దీంతో బిజెపి టికెట్ సైతం దక్కే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రఘురామకృష్ణంరాజు ఈసారి తన సొంత నియోజకవర్గం నరసాపురంలో సంక్రాంతి జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అది అంత ఈజీ అయ్యే పని కాదు. గత మూడు సంవత్సరాలుగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటూ వస్తోంది. సీఎం జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏపీ సిఐడి రఘురామకృష్ణం రాజును ఒకసారి అదుపులోకి తీసుకుంది. హైదరాబాదు నుంచి తీసుకొచ్చి దర్యాప్తు చేసింది. అయితే తనపై ఏపీ సిఐడి అధికారులు చేయి చేసుకున్నారని.. దర్యాప్తు నెపంతో ఇబ్బంది పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అటు జగన్ వ్యతిరేక మీడియాకు రఘురామకృష్ణం రాజు ఒక వార్త వనరుగా మారారు. అటు చంద్రబాబుతో సన్నిహిత్యం పెంచుకున్నారు. పవన్ తో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. బిజెపి అగ్ర నాయకత్వంతో సైతం టచ్ లో ఉన్నారు. అయితే ఇన్ని ఉన్నా రఘురామకృష్ణం రాజు కు టికెట్ ఇస్తే ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉందని అన్ని పార్టీలకు నివేదికలు వెళ్లాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు రఘురామకృష్ణంరాజు అంటే అంత దూరం వెళ్ళిపోతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....