spot_img
Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ సంచలనం

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ సంచలనం

Telangana Elections 2023: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంది. అయితే బీజేపీ ఎలాంటి పథకాలు ప్రకటించకపోయినా ఊహించని విధంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు అనుకూలంగా మారారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలను మరింత ఆకట్టుకునే విధంగా ఢిల్లీ పెద్దలు కొత్త ప్రయోగం చేపట్టనున్నారు. దీంతో తమ పార్టీని ఆదరించడం ఖాయమని అంటున్నారు. ఈమేరకు త్వరలోనే ఓ సంచలన ప్రకటన వెలువరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణలో మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అన్నట్లుగా గట్టి పోటీ ఇచ్చింది. దుబ్బాక తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నిక తో బీజేపీ ఫామ్ లోకి వచ్చినట్లయింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీలో కొన్ని మార్పులు చోటు చేసుకున్న తర్వాత మూడో స్థానానికి పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలని లక్ష్యంతో పాటు అధికారంలో రావడానికి ఆ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో డిమాండ్ కొనసాగుతోంది. ఎస్సీలోని కొన్ని కులాలకు అన్యాయం జరుగుతందని, వర్గీకరణతోనే అందరికీ న్యాయం అవుతుందని కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత కేంద్రానికి పంపించింది. ఆ తరువాత ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని రాష్ట్రాలకు 2017లో సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు కేంద్రాన్ని కలిసి ప్రత్యేకంగా కోరారు. ఎస్సీల వర్గీకరణతో పాటు కుల గణన చేపట్టాలని 2021 అక్టోబర్ 5న అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

అయితే ఇంతకాలం ఈ విషయంపై కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తెలంగాణలో ఎన్నికల వేళ ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేపడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ వర్గీకరణ కోసం న్యాయ నిపుణులను కూడా కలుస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్రం ఎస్సీ వర్గీకరణపై సంచలన నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా? లేదా? చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper