Modi Visits Pawan Kalyan House: రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం క్రితం తీవ్రమైన అనారోగ్య సమస్య కారణంగా , నాజల్ సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ , ప్రస్తుతం తన నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ముక్కు నుండి బ్లీడింగ్ జరుగుతూనే ఉందట. రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించగా, ఆయనకు ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. మరో వారం రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కి విచేస్తున్నాడు. హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే మీటింగ్ లో మోడీ పాల్గొనబోతున్నారు .
అయితే అంతకంటే ముందే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి , ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీయనున్నాడని టాక్. ప్రధాన మంత్రి నరేద్ర మోడీ కి పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్త మిత్రుడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఇచ్చేంత విలువ , నరేంద్ర మోడీ దేశంలో ఏ నాయకుడికి కూడా ఇవ్వదు. పార్లమెంట్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు , మంత్రులు ఉన్న సమయంలో , ఇతను పవన్ కాదు , తుఫాన్ అంటూ సంబోధించడం అప్పట్లో ఒక సంచలనం. దీనిని బట్టీ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మోడీ కి ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది. రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా మోడీ రావడం , ఆయనకు పవన్ మీద ఎంత ఆప్యాయత ఉందో చెప్పడానికి నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే నేడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గా సువెందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇండియా లో NDA కూటమి కి చెందిన ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఆయనతో మోడీ సరదాగా జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నేడు బాగా ఉండుంటే, ఆయన కూడా ఈ వేడుకలో పాల్గొనేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ , నరేంద్ర మోడీ మధ్య జరిగే సరదా సంబాషలను చూసి అభిమానులు సంబరాలు చేసుకునేవారు అని అంటున్నారు విశ్లేషకులు.