ఏపీలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కంపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ను వీడియో చిత్రీకరణ కూడా చేస్తున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి అన్ని ఫలితాలు వెలువడాలంటే సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కార్పరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభం అయినప్పటికీ.. ఫలితాల సరళి తెలిసేందుకు మధ్యాహ్నం కావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం వరకు ఫలితాల ట్రెండింగ్ ఒకసారి పరిశీలిస్తే.. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవానే కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో సత్తా చాటుతున్న వైసీపీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లపై వైసీపీ ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. దీంతో వైసీపీ సర్కారు వికేంద్రీకరణకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీన్ని చెప్పుకుంటోంది.
Also Read: గంటా కొత్త స్కెచ్.. బీజేపీ నుంచి పవన్ను దూరం చేయడమే టార్గెట్
గుంటూరు కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 50 స్ధానాల్లో వైసీపీ ఏపక్షంగా 37 స్థానాలు కైవసం చేసుకుంది. విపక్ష టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితం అయింది. జనసేన 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. ఇక్కడ వైసీపీ తొలిరౌండ్ నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. పోటీలో జనసేన-బీజేపీ కూటమి కూడా ఉండటంతో పలుచోట్ల ఓట్ల చీలిక కూడా జరిగినట్లు భావిస్తున్నారు.
అటు విజయవాడ కార్పొరేషన్లోనూ వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ మొత్తం 64 స్ధానాలు ఉండగా.. వైసీపీ ఇప్పటికే 7 స్థానాల్లో విజయం సాధించింది. మరో పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ మాత్రం మూడు డివిజన్లు గెల్చుకుంది. కేవలం 9, 11, 45 డివిజన్లను టీడీపీ కైవసం చేసుకుంది. పోస్టల్ ఓట్లలో వెనుకబడిన టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత అసలు ఓట్లలో మాత్రం ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు. ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే విజయవాడ కార్పొరేషన్ను కూడా వైసీపీ సునాయాసంగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అమరావతి పరిధిలో వైసీపీ సాధిస్తున్న విజయాలపై ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ సర్కారు చేపట్టిన వికేంద్రీకరణకు అమరావతి ప్రజలు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. టీడీపీ మాత్రం కృత్రిమ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఇంకా రాజధాని రాజకీయాలు చేస్తోందని సజ్జల విమర్శించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కార్పొరేషన్ విజయంపై ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో వినుకొండ, రేపల్లె, సత్తెనపల్లి వంటి మున్సిపాలిటీలనూ వైసీపీ కైవసం చేసుకుంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Ap municipal elections results in guntur
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com