Homeఆంధ్రప్రదేశ్‌నేటి నుంచి సభాసమరం.. కొట్లాట దేనిపైనంటే?

నేటి నుంచి సభాసమరం.. కొట్లాట దేనిపైనంటే?

Chandhrababu and Jagan

ఆంధ్రప్రదేశ్ లోని బలమైన అధికార, ప్రతిపక్షాల సభా సమరానికి వేదిక రెడీ అయ్యింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి ఏపీ శాసనసభ, 10 గంటల నుంచి శాసన మండలి సమావేశం కానుంది. అసెంబ్లీని 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ సమావేశాల్లోనే 17 బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Also Read: కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా..?

ఈ 5 రోజుల్లోనే కీలకమైన బిల్లులకు ఆమోదం పొందించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉండగా.. అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. ఈ క్రమంలోనే మరోసారి అదే పని పునరావృతం కానుంది.

Also Read: ఏపీ మంత్రి నానిపై హత్యాయత్నం.. ఎందుకు చేశాడంటే?

ఏపీ అసెంబ్లీలో తాజాగా ప్రభుత్వం చర్చకు పెట్టే అంశాలను ఖరారు చేసింది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌-విద్యుత్‌ రంగంలో సంస్కరణలు…, పోలవరం ప్రాజెక్టు-గత ప్రభుత్వ తప్పిదాలు.. ఇళ్ల స్థలాల పంపిణీ-ప్రతిపక్షాల కుట్ర.. టిడ్కో గృహాలు-వాస్తవాలు.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-ప్రతిపక్షాల కుట్ర.. పారిశ్రామికాభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పంచాయితీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మండలి తిరస్కరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెడుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

తొలిరోజు అసెంబ్లీలో ఇటీవలే చనిపోయిన వారిని సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలు,ఏపీకి చెందిన నేతల మృతికి సభ సంతాపం తెలుపనుంది. అనంతరం మూడురోజుల్లో ఈ 17 బిల్లులు ఆమోదించుకోనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular