
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 593 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,69,816 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,458గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,58,336 మంది కోలుకోగా ప్రస్తుతం 10,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 7,946 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.