దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్క్ 162.31 పాయింట్లు లాభపడి 40,720వద్ద ట్రేడింగ్ అయింది. అలాగే నిఫ్టీ 52.70 పాయింట్లతో 11,949 లాభంతో దూసుకెళ్తోంది. ఆటో సూచీలో 1 శాతం లాభంతో పాటు మిగతావి కూడా సానుకూలంగానే వెళ్తున్నాయి. నిన్న నష్టాల్లో కూరుకుపోయిన ముదుపర్లు నేటి లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతి ఇన్ఫాట్రేల్ ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఈ స్టాక్స్ రెండు శాతం లాభపడ్డాయి. కాగా టెక్ మహీంద్రా, నెస్ట్లే ఇండియా, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.