Prashanth Neel NTR: పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ‘కేజిఎఫ్ సిరీస్’ తో పాటు ప్రభాస్ తో చేసిన ‘సలార్ ‘ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ఆయన కంటూ ఒక భారీ మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ముందుంటుందా లేదా సాలార్ 2 సినిమా ముందు సెట్స్ మీదకి వెళ్తుందా అనే విషయాల పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు.
అయితే ఈ సినిమా కూడా డార్క్ మూడ్ లోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా డార్క్ మూడ్ లోనే తెరకెక్కించాడు.
నిజానికి ప్రశాంత్ నీల్ కి అలాంటి సినిమాలు తీయడం అంటేనే చాలా ఇష్టం అంట. ఇక సలార్ సినిమా కోసం ఏకంగా ‘ఖాన్సార్ ‘ అనే ఒక రాజ్యాన్ని సృష్టించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం “శాతవాహనుల” కాలం నాటి స్టోరీని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది కూడా ఫిక్షన్ స్టోరీ తో తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే భారీ సెట్ల తో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ సినిమా కోసం కూడా పెద్ద సెట్లు వేయాల్సిన అవసరం అయితే ఉందట. ఇక దానివల్లే ఈ సినిమా మీద చాలా కసరత్తులు చేస్తూ ఆయన ముందుకు అయితే సాగుతున్నాడు.
ఇక ఇప్పటికే సలార్ 2 సినిమా స్క్రిప్ట్ మొత్తం చేసి పక్కన పెట్టిన ఆయన ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. శాతవాహనుల కాలం నాటి రోజులను క్రియేట్ చేయడానికి ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల పైన బడ్జెట్ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుందో…