Mahesh Babu : సినీ పరిశ్రమలో రాణించాలని ఎంతో మంది అమ్మాయిలు చదువు, కెరీర్ వదిలేసి వస్తారు. ఎన్నో ఆశలతో వచ్చినప్పటికీ సక్సస్ దక్కక మధ్యలోనే పరిశ్రమకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మయూరి కాంగ్ ఒకరు. ఈ భామ 13 ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో పరిశ్రమలో రాణించలేకపోయింది. మయూరి కాంగో ఇంటర్ చదువుతున్న సమయంలోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
పలు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. మయూరి కాంగో కి సయీద్ అక్తర్ మీర్జా దర్శకత్వంలో బాల్యే ఊద్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బాబ్రీ మసీదు కూల్చివేత ఆధారంగా రూపొందించిన చిత్రం. 1995 లో విడుదలైన బాల్యే ఊద్ చిత్రంలో నసీమ్ పాత్రలో ఆమె అలరించారు. ఆ తర్వాత మహేష్ భట్ దర్శకనిర్మాణంలో 1996 లో పాపా కెహెతే హై మూవీలో లోని ఫేమస్ పాట ” ఘర్ సి నికల్తే హై ” తో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన వంశీ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు లభించలేదు. అనంతరం మయూరి కాంగో బాలీవుడ్ లో అనేక సినిమాలో నటించింది. దాదాపు 16 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. కానీ వాటిలో చాలా వరకు విడుదల కాలేదు. ఆ తర్వాత నర్గీస్, తోడా ఖుషి, డాలర్ బాబు, కిట్టి పార్టీ వంటి టెలివిషన్ షోలు కూడా చేసింది.
సుదీర్ఘ కాలం ప్రయత్నం చేసినా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2003 లో ఎన్ ఆర్ ఐ ఆదిత్య ధిల్లాన్ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె పేర్ఫార్మిక్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. 2019 లో గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ గా చేరింది. ప్రస్తుతం అదే సంస్థలో ఆమె పని చేస్తున్నట్లు సమాచారం.