Homeఎంటర్టైన్మెంట్పాపం తమన్నా.. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే...

పాపం తమన్నా.. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే…


పాపం తమన్నా భాటియా. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం.. ఆమె చేసిన ఓ ఫొటో, ట్వీట్. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ మృతికి శ్వేత జాతి పోలీసు కారణమైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తమన్నా స్పందించింది. తన ముఖానికి నలుపురంగు చేతి ముద్ర ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. దీనికి ‘నీ మౌనం నిన్ను ఎప్పటికీ కాపాడదు. మనిషి అయినా జంతువైనా ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే కదా? ఈ లోకంలో ఏ సృష్టిని అయినా అణిచివేయడం సృష్టి ధర్మానికే విరుద్ధం. ఇప్పుడు మనిషి మనిషిగా ఉండడం మళ్లీ నేర్చుకోవాలి. ప్రేమ, జాలి, కరుణ వ్యక్త పరచాలి’ అని ఆమె ట్వీట్ చేసింది.

అయితే, దీనిపై కొందరు తమన్నాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో నటించింది. నల్లగా ఉన్న యువతులు జీవితాంతం అదే రంగులో ఉండకుండా తెల్లగా అవ్వాలంటే ఈ బ్యూటీ క్రీమ్ వాడాలని ప్రచారం చేసింది. అప్పటి వీడియోను, ఆమె ఫొటోలను పోస్ట్ చేసిన నెటిజన్లు..నల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు కాదన్న నువ్వు నల్లజాతిపై అహంకారం వద్దని చెబుతున్నావా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖం తెలుపు రంగులో ఉంటేనే బాగుంటుందంటూ ప్రచారం చేసిన తమన్నా ఇప్పుడు మరోలా వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై ముందుగా సరైన అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు. ఫెయిర్ అండ్‌ లవ్లీ యాడ్‌లో… నలుపు నుంచి తెలుపు రంగుకు మారే తమన్నా ఫొటోలను షేర్ చేసి.. ‘ఈ ఫొటోనే చాలా విషయాలు చెబుతుంది’ అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. మరి, ఈ ట్రోలింగ్‌పై తమన్నా ఎలా స్పందిస్తుందే చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular