తన వ్యాఖ్యలు, చేతలతో వివాదాస్పద నటిగా ముద్రపడిన శ్రీరెడ్డి.. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ.. శ్రీరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసిందన్నది చూద్దాం.
చాలా కాలంగా హైదరాబాద్ ను వదిలి, చెన్నైలో ఉంటోంది శ్రీరెడ్డి. అయితే.. తరచూ సోషల్ మీడియాలో పర్సనల్, కెరీర్ కు సంబంధించిన అప్డేట్లు వదిలే ఈ అమ్మడు.. కొంత కాలంగా సైలెంట్ అయిపోయింది. దీనికి కారణం కరోనా కావొచ్చని చాలా మంది భావించారు. అయితే.. రీజన్ అది కాదని చెప్పింది శ్రీరెడ్డి. తాను డిప్రెషన్లో ఉండిపోయానని, అది ఎక్కువయ్యే సరికి డాక్టర్ ను కూడా సంప్రదించాల్సి వచ్చిందని తెలిపింది. అందువల్లే ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టు చెప్పింది.
ఇదే క్రమంలో.. పవన్ గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్క్, ప్రొఫెషనలిజంలో పవన్ కల్యాణ్ పర్వాలేదని చెప్పింది. అయితే.. రాజకీయాలు ఆయనకు సూట్ కావనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది. అయితే.. భవిష్యత్ లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించింది. మార్పు అనేది భవిష్యత్ లో రావొచ్చేమో.. అదే జరిగితే మా జగన్ కు మంచి పోటీదారు కావాలని ఆశిస్తున్నట్టు చెప్పింది శ్రీరెడ్డి.
ఇక, తాను ఎవరినీ జీవితాంతం శత్రువులుగా చూడనని చెప్పింది. ‘‘ఒకరిపై కామెంట్ చేస్తున్నానంటే.. వాళ్లు జీవితాంతం నచ్చరని కాదు. పర్సనల్ గా కూడా వాళ్లు శత్రువులే అని అనుకోవడం పొరపాటు. నచ్చకపోతే ఎవ్వరినీ వదలను కానీ.. లైఫ్ లాంగ్ శత్రువులుగా మాత్రం భావించను. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఛాన్స్ ఇస్తే.. ఆయన సినిమాలోనూ నటిస్తా’’ అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.