Srinu Vaitla: ఇండస్ట్రీ లో కొంతమంది డైరెక్టర్స్ ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ చిరకాలం ఆడియన్స్ మదిలో పదిలంగా ఉంటుంది. ఎన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆ బ్రాండ్ ఇమేజి చెక్కు చెదరకుండా ఉంటుంది. అలాంటి బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు శ్రీను వైట్ల. ఆయన రవితేజ హీరో గా నటించిన ‘నీకోసం’ అనే చిత్రం ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం. ఆ తర్వాత ‘ఆనందం’, ‘సొంతం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘దుబాయ్ శ్రీను’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్ షా’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో వెంకీ, సొంతం, దుబాయి శ్రీను చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఇప్పటికీ కూడా మనకి బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు పెట్టుకొని చూస్తుంటాం. సోషల్ మీడియా లో మీమెర్స్ కూడా ఏక్కువగా ఈ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను అనేక సందర్భాలలో వాడుకుంటూ ఉంటారు.
అలాంటి శ్రీను వైట్ల ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో తన మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో హిట్స్ ఉన్న వాడికే విలువ, హిట్స్ లేని దర్శకులను, హీరోలను మర్చిపోతున్న రోజులివి. పైగా స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియన్ సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు. శ్రీను వైట్ల కూడా పాన్ ఇండియన్ సినిమాలు తియ్యగలడు, కానీ ఆయనకీ అవకాశాలు ఇచ్చే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ఆయన గత చిత్రం 2018 వ సంవత్సరం లో విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో అజ్ఞాతం లోకి వెళ్లిన శ్రీను వైట్ల మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘విశ్వం’ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ హీరో గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఇందులో ఆయన ఆగడు చిత్రం తాలూకు అనుభూతులను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘మహేష్ బాబు తో ‘ఆగడు’ చిత్రం చేయకుండా ఉండాల్సింది. ఆ సినిమా నా జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఆ సినిమా చేసినందుకు నిజంగా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. వాస్తవానికి మహేష్ బాబు తో ‘దూకుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేయాలని అనుకున్నాను. ఈ కథ మహేష్ కి చెప్పగానే అదిరిపోయింది, చేసేద్దాం అని అన్నాడు. కానీ నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టలేము, అసలే అప్పుల్లో ఉన్నామని చెప్పారు. అప్పుడు సింపుల్ గా ‘ఆగడు’ చిత్రం చేసాము, అది ఫ్లాప్ అయ్యింది’ అంటూ చెప్పొచ్చాడు శ్రీను వైట్ల. ఇప్పుడు ‘విశ్వం’ సినిమాతో మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More