Sarkaru vari pata: సూపర్స్టార్ మహేశ్ నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానులకు పండగే. థియేటర్లన్నీ రెండ్రోజుల ముందు నుంచే సందడిగా కనిపిస్తాయి. తాజాగా, మహేశ్ నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్టైనర్గా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా కనిపించనుంది. తొలిసారి మహేశ్కో కలిసి ఈ మహానటి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే కుంభకోణం నేపథ్యంలో తండ్రిని కాపాడుకునే కొడుగ్గా మహేశ్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు ఇటీవల మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను వేరే లెవెల్లో పెట్టింది. ఈ సినిమాలో మహేశ్ కొత్త లుక్తో స్టైలిష్గా కనిపించనున్నారు.
https://youtu.be/2cVu7KZxW3c
మరోవైపు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని మొదట భావించారు. విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏప్రిల్1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ న్యూస్ పిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ కంపెనీ ఈ సినిమా హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sarkaru vari pata movie overseas rights sale for 15crores buzz creating at film industry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com