Ram Charan: కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజగా టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్లైన్ వైద్య బృందాలకు సెల్యూట్ చేశాడు.

“చారిత్రక ఘనతను సాధించడానికి సహాయపడిన మా ఫ్రంట్లైన్ వైద్య బృందానికి గర్వంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్యూట్ చేశారు. భారతదేశం విజయవంతంగా 100 కోట్ల టీకాలు వేసింది. అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
India has successfully administered 100 crore vaccinations to score a #VaccineCentury
I salute our frontline medical teams who helped achieve this historic feat. @MoHFW_INDIA— Ram Charan (@AlwaysRamCharan) October 23, 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే… రాజమౌళితో రామ్ చరణ్ చేస్తున్న అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. ఈ భారీ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. ఇటీవల చరణ్ ‘జెర్సీ’ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తదుపరి చిత్రానికి సంతకం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోవైపు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. అలానే శంకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.