Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి పవర్స్టార్ పవన్ కల్యాణ్తో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే వారం హైదరాబాద్లో ఈ సమావేసం జరగే అవకాశం ఉంది. వీరిద్దరి కలయికకు సినిమా విడుదల విషయంలో తలెత్తిన సమస్యలే కారణమని తెలుస్తోంది.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటికే ఏపీలో టికెట్ ధరతగ్గింపు ఆర్ఆర్ఆర్కు సమస్యగా మారగా.. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లనాయక్ మరో కొత్త తలనొప్పిగా మారింది.
ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో వారం రోజులు గ్యామ్ ఉంది. ఈ క్రమంలోనే ఒకవేళ ఆర్ఆర్ఆర్ కాస్త అటూ ఇటూ అయినా.. భీమ్లనాయక్ ప్రభావం సినిమాపై భారీగా పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ విడుదల తేదీని వాయిదా వేయాలని కోరేందుకు రాజమౌళి పవన్ను ప్రత్యేకంగా కలపనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య చర్చలు జరగగా పెద్ద ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భీమ్లానాయక్ దర్శకనిర్మాతలపై వెనక్కి తగ్గాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజా ట్వీట్లో వెనక్కి తగ్గేదే లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.
రాజమౌళి, పవన్ సమావేశానికి ముందే.. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు దానయ్య, దిల్ రాజు తదితరులు.. త్రివిక్రమ్ను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సమావేశాల తర్వాత భీమ్లానాయక్ వెనక్కి తగ్గుతాడా?.. లేక మొండిగా ముందుకు దూసుకెళ్తాడా తెలియాల్సి ఉంది.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More