Rajamouli: ప్రస్తుతం పాన్ ఇండియా లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఏకైక దర్శకుడు రాజమౌళి.. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ ‘ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్లో తను మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ టాపిక్ అయితే వచ్చింది.
ఇక దాంతో అక్కడున్న యాంకర్ ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అడగగా అక్కడున్న వాళ్ళందరూ ఎన్టీఆర్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అది విన్న రాజమౌళి నవ్వుతూ నాకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే బాహుబలి, ఈగ సినిమా ప్రొడ్యూసర్లైన సాయి కొర్రపాటి,శోభు యార్లగడ్డ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నా తమ్ముడు లాంటోడు తమ్ముడికి ఫ్రెండ్ కి చాలా తేడా ఉంటుంది అంటూ తను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక అలాగే కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడుతూ కొరటాల శివ ఈ సినిమాని సమర్పిస్తున్నాడు అనగానే ఈ సినిమాలో ఏదో వైవిధ్యమైన కథంశామైతే ఉంటుందని అనుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. అలాగే సత్యదేవ్ లాంటి ఒక నటుడికి సరైన సినిమా పడితే ఆయన స్టార్ హీరోగా మారుతాడు. ఆ సినిమా ఇదే అని నేను భావిస్తున్నాను అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సినిమా యూనిట్ లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమనే చెప్పాలి. అందుకే ఆయనతో ఇప్పటివరకు నాలుగు సినిమాలను చేశాడు.
ఇంతవరకు ఎవరితో చేయలేని విధంగా ఆయనతో నాలుగు సినిమాలు చేసి ఆయనకు నాలుగు సూపర్ డూపర్ సక్సెస్ లు అందించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి సినిమాల వల్లే ఎన్టీఆర్ భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక వాటిని మినహాయిస్తే ఎన్టీఆర్ కెరియర్ లో వేరే దర్శకులు ఇచ్చిన సక్సెస్ లు చాలా తక్కువనే చెప్పాలి…